Saturday 30 May 2020

తాప్సీ ఇంట్లో విషాదం.. శూన్యాన్ని వదిలి వెళ్లిందంటూ భావోద్వేగ పోస్ట్

బాలీవుడ్ సంచలన నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం నాడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ. గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన తాప్సీ.. ‘కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ. తెలుగులో మంచు మనోజ్ ‘ఝమ్మంది నాదం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తాప్సీ.. వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీరా, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో వంటి చాలా చిత్రాల్లో నటించినప్పుటికీ ఆమెలోని నటికి పనిచెప్పే పాత్ర ఒక్కటీ పడకపోవడంతో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యింది. బాలీవుడ్‌లో పింక్, ఘాజీ, తాపడ్ వంటి చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రలు చేసి సంచలన నటిగా గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు, హిందీతో పాటు తమిళ్‌లోనూ పలు చిత్రాలు చేసింది తాప్సీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన తరువాత తాప్సీ కెరియర్ ఊపందుకుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది తాప్సీ. ఇక వివాదాల్లోనూ ముందుంటే తాప్సీ.. దర్శకేంద్రుడు కె. రాఘంవేంద్రరావు హీరోయిన్స్ బుడ్డు చూపించి కొబ్బరి కాయలతో కొట్టించడంపై అభ్యతరం చెప్తూ వివాదాస్పద కామెంట్ చేసింది తాప్సీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36IkwwY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...