Friday 28 May 2021

డ్రగ్స్ కేసులో మళ్లీ కదలికలు.. సుశాంత్ సింగ్ స్నేహితుడు అరెస్ట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది జరిగిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికంటే ముఖ్యంగా యంగ్ హీరో అనుమానాస్పద రీతిలో మరణించడం అందరినీ కుదిపేసింది. ముందుగా అది ఆత్మహత్య అని నిర్దారించారు పోలీసులు. ఆ తరువాత ఆ కేసులో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. సుశాంత్ సింగ్‌ది హత్యేనని కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆయన మిత్రులు చేసిన ఫిర్యాదు మేరకు చివరకు సీబీఐ వద్దకు కేసు చేరింది. అలా సీబీఐ ఎంట్రీ ఇచ్చాక సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా లింకులన్నీ బయటకు వచ్చాయి. సుశాంత్ సింగ్‌కు అతని ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేసిందనే విషయం బయటకు వచ్చింది. సుశాంత్ కోరిక మేరకు అలా డ్రగ్స్ ఇచ్చానని రియా చక్రవర్తి చెప్పుకొచ్చారు. రియా, ఆమె సోదరుడిని కూడా ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ సింగ్ మృతిపై విచారణ జరుగుతుండగానే ఇలా డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టైంది. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. శ్రద్దా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్‌లు ఎంతటి ట్రోలింగ్‌కు గురయ్యారో అందరికీ తెలిసిందే. ఇక సుశాంత్ మరణించే సమయంలో ఆయన ఫ్లాట్‌లో ఉన్న సిద్దార్థ్ పితానీ ఈ కేసులో ముఖ్య సాక్షిగా ఉన్నారు. ఈయన చుట్టూ కూడా డ్రగ్స్ కేసు ఉచ్చు బిగుస్తోంది. సుశాంత్ కేసు విషయంలో ఇప్పటికే ఎన్నో మార్లు విచారణకు హాజరైన సిద్దార్థ్ పితానిని నేడు ఎన్సీబీ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ కేసులో సిద్దార్థ్ పితానిని నేడు హైద్రాబాద్‌లో అరెస్ట్ చేసి ముంబై కోర్టులో ప్రవేశపెట్టారు. జూన్ 1 వరకు పోలీస్ కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన నివాసంలో ఎన్నో పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లభించాయని పోలీసులు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c0mjS4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...