దక్షిణాది సినీ హీరోయిన్ వివాహాం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రణీత ఇలా ముఖ్యమైన విషయం గురించి ప్రకటన చేయకపోవడం, ముందే చెప్పకపోడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆమె అభిమానులు తెగ ఫీలవుతున్నారు. అయితే ప్రణీత ఇప్పుడు తన అభిమానులు శాంతపరిచేపనిలో పడ్డారు. అభిమానులందరినీ ఉద్దేశిస్తూ తన పెళ్లిపై ఓ ప్రకటన చేశారు. నేటి ఉదయం నుంచి ఫోటోలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి. వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత వివాహామాడారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే పెళ్లిపై ముందుగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా ప్రణీత చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మే 30న మేం పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది.. ఈ పెళ్లి గురించి ముందుగా మీకు ఎలాంటి సమాచారాన్ని అందించలేకపోయాం.. మీరు నన్ను క్షమించండి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెళ్లి తేదిని చివరి వరకు మేం కూడా నిర్ణయించుకోలేదు. అలా ఏదో ఒక డేట్ చెప్పి మీ అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకిష్టం లేదు.. మీరు దయచేసి నా క్షమాపణలను స్వీకరించండి.. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు మీరంతా భాగస్వామ్యం కావడం కంటే నాకు మరో ఆనందం లేదు.. మీరంటే నాకెప్పుడూ ప్రత్యేకమే.. పరిస్థితులన్నీ చక్కబడ్డాక మనందరం కలిసి సెలెబ్రేట్ చేసుకుందాం.. ప్రేమతో ప్రణీత అండ్ నితిన్’ అని చెప్పుకొచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c5V606
v
No comments:
Post a Comment