లాక్ డౌన్ వేళ హీరోయిన్ పీటలెక్కింది. రహస్యంగా తన ప్రియుడు నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ప్రణీత. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని తన నివాసంలో కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ ఈ పెళ్లి జరిగిందని సమాచారం. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్రణిత పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంత సడెన్గా ఆమె పెళ్లి విషయం బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ప్రియుడు నితిన్ రాజు బ్యాక్ గ్రౌండ్ గురించిన విషయాలపై సెర్చింగ్ ప్రారంభించారు నెటిజన్లు. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత ''బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస'' వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టం మాత్రం అంతగా కలిసిరాలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34LkPHv
v
No comments:
Post a Comment