కరీంనగర్ సుల్తానాబాద్కు చెందిన కన్నయ్య మటన్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన మటన్ షాప్లో పేరిట అదిరిపోయే ఆఫర్ నడుస్తోంది. ఆఫర్ అంటే తన జేబులు నింపుకోవడానికి మాత్రమే కాదు.. కరోనా రోగులకు తన వంతు సాయంగా నిలబడటం కోసం కూడా. ప్రస్తుతం మార్కెట్లో కిలో మటన్ ధర రూ.700 నుంచి 800 వరకూ ఉంది. ఆన్ లైన్లో అయితే రూ.1000 వరకూ ధర పలుకుతుంది. అయితే కరీంనగర్ కన్నయ్య మటన్ షాపులో కిలో మటన్ ధర కేవలం రూ. 650 మాత్రమే. ఇందులో రూ.600 కన్నయ్య తీసుకుని మిగిలిన రూ.50 రూపాయిల్ని సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్కి విరాళంగా ఇస్తున్నాడు. ఈ ఆఫర్ ఏదో బాగుందే.. కరోనా రోజుల్లో మటన్ ముక్క తిన్నట్టుగానూ ఉంటుంది.. యాభై రూపాయిలు సాయం చేసినట్టుగా ఉంటుందని జనం కన్నయ్య మటన్ షాపు దగ్గర క్యూ కడుతున్నారు. అయితే ఈ విషయం తీన్మార్ వార్తలు ద్వారా సోనూసూద్కి చేరడంతో ఫన్నీగా రియాక్ట్ అయ్యారాయన. ‘నేను శాఖాహారిని.. మటన్ షాపు దగ్గర నా పేరా?? ఏదైనా వెజిటేరియన్ షాపు పెట్టుకుంటానంటే ఏదైనా సాయం చేస్తా’ అంటూ నవ్వుతున్న ఎమోజీతో ట్వీట్ చేశారు సోనూసూద్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34LIV4V
v
No comments:
Post a Comment