Sunday 30 May 2021

14 రీల్స్‌కి శర్వానంద్ కోర్టు నోటీసులు.? అసలు గొడవ డబ్బు కోసం కాదా?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి లీకులు బయటకు వస్తాయో ఎవ్వరికీ తెలియదు. కొన్ని సార్లు అందులో నిజాలు ఉండొచ్చు..లేదా పుకార్లు మాత్రమే అయి ఉండొచ్చు. ఇంత వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న మీద తాజాగా ఓ పుకారు వచ్చింది. శర్వానంద్ చివరగా సినిమాలో కనిపించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ పడి అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాకు కాస్త నష్టమే వచ్చిందని తెలుస్తోంది. తాజాగా శర్వానంద్ తన రెమ్యూనరేషన్ గురించి నిర్మాణ సంస్థకు నోటీసులు పంపించాడనే టాక్ బయటకు వచ్చింది. శ్రీకారం సినిమాకు శర్వానంద్ 6 కోట్లు తీసుకున్నారట. ఇందులో 4.5కోట్లు సినిమా విడుదలకు ముందే చెల్లించారట. మిగతా రెండు కోట్లు సినిమా విడుదలయ్యాక ఇస్తామని నిర్మాతలు అన్నారట. సినిమా విడుదలైనా కూడా వ్యవహారం ముందుకు సాగకపోవడంతో శర్వానంద్ పదే పదే అడిగారట. అలా మరో యాభై లక్షలు నిర్మాతలు ఇచ్చారట. వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో మిగిలిన 1.5 కోటి కోసం శర్వానంద్ ఇప్పుడు నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారనే టాక్ నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. అయితే శర్వానంద్ మాత్రం ఇలా చేసే హీరో కాదని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు. డబ్బు గురించ‌యితే నిర్మాత‌, హీరోలు కూర్చుని సెటిల్ చేసుకుంటారు.. మాటల్లో పోయేదాన్ని ఇలా కొర్టుల దాకా, మీడియా దాకా తెచ్చారంటే ఇంకా ఏదో ఉండొచ్చని అంటున్నారు. కచ్చితంగా అది మనీ మేట‌ర్ కాదు.. ఇంకా ఏదో దాస్తున్నారనేది సమాచారం. డబ్బు గురించి రిలేష‌న్ పోగొట్టుకొరు క‌దా అనే టాక్ వస్తోంది. ఎవ‌రో ఎక్క‌డో హ‌ర్ట్ అయి ఉంటారని లేదా ఇంకేదో జ‌రిగి ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరో ఒకరు బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడితే తప్పా ఓ క్లారిటీ వచ్చేలా లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p3bEva
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...