Friday 30 October 2020

Kushboo: రజినీకాంత్ ఆరోగ్యంపై కుష్బూ ట్వీట్.. సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదంటూ మెసేజ్

సూపర్ స్టార్ అనారోగ్య కారణాల వల్ల రాజకీయ అరంగేట్రం చేయడంలేదని పేర్కొంటూ ఇటీవల ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రజినీ రాజకీయాల్లోకి వెళ్లకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లుగా ఆ లేఖలో రాసి ఉండటంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ లేఖ విషయమై రియాక్ట్ అయిన రజినీకాంత్ ఆ లేఖ ఫేక్ అని తెలిపారు. అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని వెల్లడించారు. దీంతో అంతా రజినీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా దీస్తున్నారు. Also Read: ఈ క్రమంలో తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు సుందర్ స్పందించారు. ''డియర్ రజినీకాంత్ సర్. మీరు వజ్రం లాంటి వారు. మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. ఆరోగ్యపరంగా ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందో అదే చేయండి. మీరు ఎపుడు ఎక్కడా ఏ పార్టీ పెట్టినా.. మీపై మాకున్న గౌరవంలో ఎలాంటి మార్పు ఉండదు. మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము'' అంటూ ట్వీట్ చేశారు ఖుష్బూ. కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లెటర్‌లో రజినీకాంత్ ఇక రాజకీయాల్లోకి రారని, ఈ మేరకు ఆయన ఈ ఏడాది డిసెంబర్‌లో తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారని రాసి ఉండటంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. 2017 డిసెంబర్‌లో రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు. అది జరిగి ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా పార్టీని స్థాపించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రజినీకాంత్ చేయబోయే రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35MHSSe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...