లాక్డౌన్ సమయంలో వేలాది కార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు బహుభాషా నటుడు . ఆయన చేసిన సేవలకు దేశమంతా ప్రశంసలతో ముంచెత్తింది. లాక్డౌన్ ముగిసి ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సాయమంటూ వస్తున్న వారిని కాదనకుండా ఆదుకుంటున్నాడు. దీంతో ఇటీవల అతడికి భారీగా ఫాలోయింగ్ పెరిగింది. చాలామంది దర్శక నిర్మాతలు సోనూని తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తున్నారట.
ప్రస్తుతం ఆయన తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇటీవల సోనూసూద్ రెమ్యునరేషన్ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర కోసం సోనూసూద్ను సంప్రదించారు. అయితే ఆయన చెప్పిన రెమ్యునరేషన్ విని బోయపాటి టీమ్కు చెమటలు పట్టాయట. Also Read: సోనూసూద్ ఇప్పటివరకు సినిమాకు రూ.1-1.5కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.4కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో ఆయన కోసం వెళ్లిన తెలుగు దర్శక నిర్మాతలు ఏం మాట్లాడలేక వెనుదిరుగుతున్నారట. ఇలాగే మరో నిర్మాతకు కూడా ఇదే విధంగా షాక్ ఇవ్వడంతో ఇప్పుడు సోనూ రెమ్యునరేషన్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సినిమాల ద్వారా ఎక్కువ సంపాదించి ఆ మొత్తాన్ని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వినియోగించాలన్న ఆయన ప్లాన్గా తెలుస్తోంది. from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oG52m0
v
No comments:
Post a Comment