Saturday 31 October 2020

ఓడిపోయాం.. ఇక మన జీవితం ఇంతే! రిప్ హ్యూమానిటీ అంటూ రగిలిపోయిన రష్మీ

మానవుడిగా పుట్టి అన్నీ తెలిసిన మనమే మూగ జీవాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బాధేస్తుందనే అర్థంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . మూగ జీవాలంటే అమితంగా ఇష్టపడే ఆమె ఓ విషాదకర వీడియో షేర్ చేస్తూ ఇక మన భవిష్యత్తు ఇలాగే ఉంటుందంటూ ఆవేదన చెందింది. ఎంత అవగాహన కల్పించినా జనాల్లో మార్పు రావడం లేదంటూ కోపంతో రగిలిపోయింది రష్మీ. ఈ సృష్టిలోని మూగ జీవాలంటే యాంకర్ రష్మీకి మహా ఇష్టం. జంతు ప్రేమికులరాలిగా జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలు సార్లు ఆమె పోస్టులు పెట్టింది. మూగ జీవాలన్నాక చిన్న, పెద్ద తేడా లేదంటూ సృష్టి లోని జీవాలన్నింటినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని ఎన్నోసార్లు ట్వీట్స్ చేసింది. లాక్‌డౌన్ సమయంలోనూ వీధి కుక్కలకు స్వయంగా ఆహారం అందించి మానవత్వం చాటుకుంది రష్మీ. సృష్టిలో అన్నీ ముఖ్యమైనవే.. దేన్నీ వదులుకోవద్దు అని ఎప్పుడూ చెప్పే ఆమె.. తాజాగా షేర్ చేసిన వీడియోతో ఏకంగా రిప్ హ్యూమానిటీ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. Also Read: ఓ పిల్లాడు చిన్న కుక్క (పప్పీ)ని తీసుకొచ్చి వాటర్ ట్యాంక్‌లో వేసి దాని చావుకు కారణమై వెళ్ళిపోతున్న వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ రష్మీకి ట్యాగ్ చేశాడు. ఇదేనా మనం మన పిల్లలకు నేర్పించేది? అంటూ దానిపై కామెంట్ రాశాడు. ఈ వీడియో మూగ జీవాలను ప్రేమించే ప్రతి వ్యక్తి హృదయాన్ని కలచివేస్తోంది. కాగా ఈ వీడియో చూసిన రష్మీ వెంటనే దాన్ని రీ ట్వీట్ చేస్తూ కోపంతో రగిలిపోయింది. రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది.. రిప్ హ్యూమానిటీ అంటూ ఫైర్ అయింది. డిగ్రీలు చదివించాలనే మోజు తప్పితే చిన్నారులకు మానవతా విలువల్లో కనీస పరిజ్ఞానం ఇవ్వడంలో విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది రష్మీ. ఇది చూస్తుంటే మన భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థమవుతోందంటూ ట్వీట్ చేసింది .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HJ1jU9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...