ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ .. ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్లీ జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన ఖాతాలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కొషియుమ్’ రీమేక్ కూడా ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలు ఇద్దరు హీరోలుంటారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ నటించారు. తెలుగులో పవన్ కళ్యాణ్తో పాటు నటించే మరో హీరోను ఇంకా ఖరారు చేయలేదు. అయితే, ఈ హీరోకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని వదంతులు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా రవితేజ పేరు బలంగా వినిపించింది. అయితే, ఇప్పుడు మరో నటుడి పేరు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ నటుడు ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ కళ్యాణ్తో పోటీ పడే పాత్రలో ఆయన ఈజీగా నటించేస్తారు. అందుకే ఆయన్ని తీసుకున్నారని అంటున్నారు. మొన్నామధ్య పవన్ కళ్యాణ్ను సుదీప్ కలిశారు. అయితే, అప్పుడు పవన్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారని ప్రకటించారు. కానీ, ఆ కలవడానికి కారణం ఈ సినిమానే అని ప్రెజెంట్ టాక్. మరి ఈ రూమర్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కు జోడీగా సాయి పల్లవి నటించనున్నారనే రూమర్ కూడా ఉంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kLz3OW
v
No comments:
Post a Comment