Thursday 27 February 2020

తమన్ ప్రొఫైల్ పిక్‌లో పవన్... దూసుకెళ్లిపోతోందిగా!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ ప్రస్తుతం ‘పింక్’ రీమేక్‌ కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తమన్ పవన్‌ మిలిటరీ టోపీ పెట్టుకుని ఉన్న ఓ లోగో రిలీజ్ చేసారు. ఆ లోగోను తమన్ ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌గా మార్చుకున్నారు. అంతేకాదు పింక్ రీమేక్‌లోని మొదటి పాటను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని ఫ్యాన్స్ ఒకటే గొడవ చేసేస్తున్నారు. దీనిపై తమన్ ట్వీట్ చేస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ‘పింక్’ రీమేక్‌లోని మొదటి పాటను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా అని ఆత్రుతగా ఫీల్ అవుతున్నాను. టీం మొత్తం చాలా కష్టపడుతోంది. మీ అందరూ ఈ సినిమా ఎంత ముఖ్యం అని ఫీలవుతున్నారో మేం కూడా అంతే. పవర్ స్టార్‌కు బెస్ట్ ఇవ్వడానికి మేం కూడా మా బెస్ట్ ప్రయత్నిస్తున్నాం. లవ్యూ గాయ్స్’ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటి తర్వాత తమన్ తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్ మార్చేసారు. ‘’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. READ ALSO: కాగా ఇటీవల తమన్ తాను సినిమా కోసం కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను పవన్‌కు వినిపించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు.‘ఈరోజు కలలా ఉంది. ఎప్పటినుంచో నేను ఆయనతో కలిసి పనిచేయాలని, ఆయన సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు కంపోజ్ చేసిన పాటలన్నీ పవన్‌కు వినిపించాను. చాలా కంగారుపడ్డాను. చెమలు పట్టేసాయి. అయితే అది భయం వల్ల కాదు. ఆయన పట్ల నాకున్న ప్రేమ, ఒత్తిడి వల్ల. మొత్తానికి ఆయనకు నా పాటలు నచ్చాయి. త్వరలో ఫస్ట్ పాటతో మీ ముందుకు రాబోతున్నాను. లవ్యూ సర్’ అని పేర్కొన్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3942plr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...