Saturday 29 February 2020

Prabhas సినిమాలో దీపిక పదుకొణె అంటగా...!

యంగ్ రెబెల్ స్టార్ .. జాతీయ అవార్డు గ్రహీత నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల నాగ్ అశ్విన్ వెల్లడించారు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణెని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని మీడియా వర్గాలు నాగ్ అశ్విన్‌ని అడగ్గా.. ‘ఈ విషయం గురించి ఆ హీరోయిన్‌కే కాదు నాకూడా తెలీదు. మొన్నేగా సినిమా గురించి ప్రకటించాం. సినిమా స్టార్ట్ అవ్వడానికి మరో పది నెలలు పడుతుంది. ఇది నేను సొంతంగా రాసుకున్న కథే. ఏ సినిమాకీ రీమేక్ కాదు. ప్రభాస్‌కు కథ నచ్చే ఒప్పుకున్నారు. కథ నచ్చకపోతే మనం ఎంత ఫోర్స్ చేసినా వాళ్లు ఒప్పుకోరు కదా’ అని తెలిపారు. ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమాను తెరకెక్కిస్తానని నాగ్ అశ్విన్ అన్నారు. అయితే ఇంకా ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ అనుకోలేదు. సినిమాను మాత్రం తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. READ ALSO: ప్రస్తుతం రాధాకృష్ణ సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు. రాధాకృష్ణ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘రాధే శ్యాం’, ‘ఓ డియర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. 1930ల నాటికి చెందిన ప్రేమ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ‘సాహో’ సినిమాతో చేసిన తప్పులు ఈ సినిమాలో రిపీట్ కాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ciSLO5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...