Thursday 27 February 2020

Bheeshma Thanks Meet: నితిన్ కోసం వస్తున్న మెగా వారసుడు

యువ హీరో నితిన్‌కు దాదాపు నాలుగేళ్ల తర్వాత మంచి హిట్ వచ్చి పడింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. సినిమా రిలీజైన రోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇటీవల సక్సెస్ మీట్‌ని ఏర్పాటుచేసారు. నాలుగేళ్ల తర్వాత హిట్ వచ్చిన సందర్భంలో తనకు సంతోషంతో ఏడుపు వచ్చేస్తోందని ఆ కన్నీళ్లు కనపడకూదనే కళ్లజోడు పెట్టుకున్నానంటూ నితిన్ ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం సినిమా కోసం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటుచేయనున్నారు. వైజాగ్‌లోని గురజాడ కళాక్ష్రేత్రంలో ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతిథిగా రాబోతున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్‌గా వచ్చారు. కానీ సక్సెస్ మీట్‌కి మాత్రం ఏ గెస్ట్‌ని ఆహ్వానించలేదు. ఇక ‘భీష్మ’ సినిమా గురించి చెప్పాలంటే.. సినిమాలో నితిన్ మంచి ఈజ్‌తో నటించాడని ప్రేక్షకులు తెగ మెచ్చేసుకున్నారు. READ ALSO: ముఖ్యంగా కామెడీ చాలా బాగా చేసాడని అన్నారు. వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మరోసారి తన మార్క్ కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు. రఘు బాబు, బ్రహ్మాజీ, నరేష్ కూడా బాగానే నవ్వించారు. ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఈ చిత్రంలో కార్పోరేట్ విలన్‌గా నటించి అదరగొట్టాడు. ప్రస్తుతం నితిన్.. ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. తన నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తల్లిదండ్రులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/380rahb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...