‘మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని రక్షించుకుందాం’ అనే నినాదాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో సెలబ్రిటీలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన కంటిన్యూ అవుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు భాగస్వామ్యం అవుతూ తాము మొక్కలు నాటడంతో పాటు.. తమ సన్నిహితులు స్నేహితుల్ని ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగస్వామ్యం చేస్తున్నారు. ‘రోజా వనం’ పేరిట గత వారం సినీ నటుడు అర్జున్తో మొక్కలు నాటించిన సినీ నటి, నగరి ఎమ్మెల్యే శనివారం నాడు సీనియర్ నటి ఖుష్బూతో మొక్కలు నాటించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుష్బూ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన తోటి యాక్టర్స్ మీనా, సుహాసిని, డాన్సర్ బింద్రాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు .
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VxisV6
v
No comments:
Post a Comment