Wednesday 30 October 2019

నన్ను ‘అక్క’ అని పిలవడం కష్టమే.. సారీ బోయ్స్: అనసూయ

అనసూయ పేరు చెబితే మనకు ముందుగా గుర్తొచ్చే పాత్ర రంగమ్మత్త. ‘రంగస్థలం’లో అనసూయ చేసిన ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే అనసూయ ఎక్కడికెళ్లినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడికొచ్చే అభిమానులు రంగమ్మత్త అనే పిలుస్తారు. కానీ, ఇప్పుడు అనసూయను ‘అక్క’ అని పిలవాల్సి వస్తుందట. కుర్రాళ్లు తనను అలా పిలవడం కష్టమేనన్న అనసూయ.. ఈ విషయంలో తన అభిమానులకు సారీ చెప్పారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రీ రిలీజ్ వేడుక వేదికైంది. Also Read: విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా షమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించారు. అది అక్క పాత్ర అని అనసూయ స్వయంగా చెప్పారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే అక్క పాత్రట. అందుకే, ఇప్పటి వరకు అత్తగా తనను చూసిన ఈ కుర్రాళ్లు సడెన్‌గా అక్క అంటే జీర్ణించుకోగలరా అని అనసూయ వేదికపై అన్నారు. నిజం చెప్పాలంటే అనసూయ మాట్లాడటానికి వేదికపై వచ్చిన వెంటనే గోల మొదలైంది. అస్సలు ఆమెను మాట్లాడనివ్వకుండా ఒకటే అరుపులు, కేకలు. Also Read: ఇంకేముంది.. అనసూయను ఆపలేం కదా. ఆ అభిమానాన్ని చూసి ఆకాశానికి ఎక్కేశారు. ‘నన్ను టీజ్ చేస్తున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా’ అంటూ సరదాగా నవ్వుతూ అన్నారు. ‘‘మీ ఫేవరేట్ రౌడీ గురించి ఈ సినిమా చూస్తారని నాకు తెలుసు. మీరు ఊహించిన దానికి మించి ఈ సినిమాటో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. నవంబర్ 1 నుంచి థియేటర్లలో ఈ సినిమాను చూడండి. మీకన్నా ఒక్కరోజు ముందు నేను సినిమా చూసేస్తా’’ అంటూ చిన్న పిల్లలా భుజాలు ఎగరేశారు అనసూయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NsLiAr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...