Saturday 30 October 2021

‘పెళ్లాం లేచిపోయిందా?’.. కొత్తగా ట్రై చేసిన ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. దొరసాని అంటూ మొదటి సినిమాతో ప్రయోగమే చేశాడు. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడిస్ అంటూ సక్సెస్ కొట్టేశాడు. కానీ అది ఓటీటీకే పరిమితమైంది. అలా వచ్చిన సక్సెస్‌ను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాడు. కానీ ఈ సారి మాత్రం థియేటర్లో హిట్ కొట్టేందుకు అంటూ రాబోతోన్నాడు. తాజాగా ఐకాన్ స్టార్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. పుష్ఫక విమానం ట్రైలర్‌లో కథ ఏంటో అర్థమైపోతోంది. బావిలో కప్పలాంటి ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. కానీ అతని భార్యను మాత్రం ఎవ్వరికీ చూపించడు. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తాడు. హోటళ్లు నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినతన భార్య చేసిందని స్కూల్‌లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు. అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. కానీ అసలు తన భార్య ఉండదు. పెళ్లైన పది రోజులకే లేచిపోతుంది. ఇక ఈ విషయంలో అతడి చుట్టూ పోలీసులు తిరుగుతుంటారు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా? అని పోలీస్ కారెక్టర్‌లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హీరో ఆనంద్ చెబుతాడు. అదెక్కడ అని అంటే.. మింగేసా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. అలా మొత్తానికి ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కొత్త కథతో రాబోతోన్న విజయ్ మాస్ ఇమేజ్, స్టార్ స్టేటస్ గురించి ఆలోచించడం లేదు. మొత్తానికి కథకు ప్రాధాన్యమున్న పాత్రనే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నవంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pSs8ZG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...