Saturday 30 October 2021

మీ అన్నదమ్ములను చూస్తే మాకు మేం గుర్తొస్తాం!.. పునీత్‌పై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్

కన్నడ పవర్ స్టార్ (46) గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో దక్షిణాది చిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అప్పు అంటూ ప్రేమగా పిలుచుకునే తమ అభిమాన హీరో మరణించడంతో లక్షల మంది అభిమానులు పొటెత్తారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియ్ంలో నేడు పునీత్ పార్థీవ దేహాన్ని సందర్శానార్థం ఉంచారు. మన టాలీవుడ్ నుంచి ప్రముఖులందరూ కూడా వెళ్లారు. పునీత్‌కు నివాళ్లు అర్పించారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ ఇలా హీరోలందరూ కూడా పునీత్‌ను చివరి చూపు చూసుకుని వచ్చారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు తాజాగా పునీత్ రాజ్ కుమార్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మీ ముగ్గురు అన్నదమ్ముళ్లను చూస్తే.. మా అన్నదమ్ములం గుర్తుకు వస్తామని ఆయనతో ఉన్న మెమోరీస్‌ను నాగబాబు గుర్తుకు చేసుకున్నారు. ‘డియర్ పునీత్.. నువ్ ఎప్పుడూ నాకు తమ్ముడిలాంటివాడివే. ఎవ్వరూ ఊహించటనట్టుగా నువ్ ఎప్పుడూ నా సోదరుడివే. మీ ముగ్గురు అన్నదమ్ములు.. మా ముగ్గురిలా కనిపిస్తారు.. అంతే కాకుండా కళ్యాణ్ బాబులా మీరు కూడా పవర్ స్టార్ అని పేరొందారు.. అయితే కేవలం ఇవే కారణాలు కాదు.. మీరు చేసిన మంచి పనులు, మీ చారిటీలు, సేవా గుణం, మంచి మనసుల ఇలా అన్నింటితో మీరు కేవలం నటుడిగానే కాకుండా మంచి మనిషిగానూ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. మీరు మాతో ఉండకపోవచ్చు.. కానీ మీరు చూపించిన దారి, మీ మంచిదనం ఎప్పటికి చిరకాలంగా నిలిచిపోతుంది. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం’ అని నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3brSWY0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...