Saturday 30 October 2021

ఇండస్ట్రీలో వాడుకుని వదిలేస్తారు!.. డైరెక్టర్ మారుతి సంచలన కామెంట్స్

డైరెక్టర్ సినిమాను తెరకెక్కించే విధానం గురించి అందరికీ తెలిసిందే. చిన్న బడ్జెట్‌లో సినిమాను చుట్టేయగలడు. భారీ బడ్జెట్ చిత్రాలనూ హ్యాండిల్ చేయగలడు. అయితే మారుతి ఏ సినిమాను తెరకెక్కించినా కూడా తన మార్క్ మాత్రం కచ్చితంగా కనిపిస్తుంటుంది. హాస్య ధోరణిలోనే సినిమాను ముందుకు తీసుకెళ్తాడు. కరోనా కంటే ముందు పక్కా కమర్షియల్ అనే సినిమాను గోపీచంద్‌తో మొదలుపెట్టాడు. అయితే మధ్యలో కరోనా రావడం, షూటింగ్‌లు అన్నీ బంద్ అయిపోవడంతో మారుతి కొత్త ఆలోచన వచ్చింది అందరూ కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్నారని, ఎప్పుడూ భయపడని మిడిల్ క్లాస్ వాళ్లు కూడా భయాందోళనలో ఉన్నారని మారుతి అన్నాడు. అలాంటి వారి కథను తీయాలనే ఆలోచన రావడం, 20 రోజుల్లో కథను రాయడం, ముప్పై రోజుల్లో సినిమాను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. చాలా చిన్న బడ్జెట్‌తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే అజయ్ ఘోష్ అయితే ఎంత ఇస్తే అంత తీసుకుంటాడని ఈ కారెక్టర్‌కు ఎంచుకున్నట్టు చెప్పాడు. అలా చాలా తక్కువ బడ్జెట్‌లో ఏదో టైం పాస్‌కు తీసినట్టు తీశాను. కానీ సినిమా చాలా సీరియస్‌గా వచ్చింది అని అన్నాడు. ఈ చిత్రం మనసుకు వేసే వ్యాక్సిన్. మీ భయాలను అన్నింటిని పోగొడుతుందని మారుతి అన్నాడు. ఇక హీరో గురించి మాట్లాడాడు. వర్షం లాంటి హిట్ ఇవ్వడంతో ప్రభాస్ ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాడు. యూవీ క్రియేషన్స్ సంతోష్‌తో సినిమాలు తీస్తోంది. వారికి ఎవరైనా రూపాయి ఇస్తే వందరూపాయలు తిరిగి ఇస్తారు.. ఎవ్వరి రుణాన్ని ఉంచుకోరు.. ఇండస్ట్రీలో వాడుకుని వదిలేస్తారు.. నాకు తెలుసు. కానీ ఇలాంటి వారు మాత్రం ఉండరు అంటూ యూవీ క్రియేషన్స్, వంశీ ప్రమోద్, ప్రభాస్ గురించి మారుతి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mrI3Mc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...