Sunday 31 October 2021

ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు! రోజులు మారుతుంటే జరిగేది అదే.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

ట్విట్టర్ ఖాతా నుంచి ఎప్పుడైతే అక్కినేని పేరును తొలగించిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో పేరు మారుమోగిపోతోంది. నాగ చైతన్యతో విడాకుల విషయమై బోలెడన్ని వార్తలు షికారు చేసిన అనంతరం అవన్నీ నిజమే అని ప్రకటించి షాకిచ్చింది సమంత. చైతూతో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ క్షణం నుంచి తనదైన దారిలో వెళుతూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది సమంత. సోషల్ మీడియా ఖాతా ద్వారా తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూనే మోటివేషనల్ లైన్స్ షేర్ చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి దైర్యం ముఖ్యమంటూ ఆమె షేర్ చేస్తున్న సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అమ్మాయి చదువు, పెళ్లి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచనలిచ్చిన సామ్.. తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్రముఖ రైటర్ రాబర్ట్ రాసిన పదాలను ఇన్స్‌స్టా స్టోరీగా పెట్టేసింది. ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే ఆ మనిషి ఏంటనేది తెలియజేస్తాయని, ఆ సమయంలో మనిషి స్వభావం బయట పడుతుందని రాబర్ట్ రాసిన వాక్యాలను అందరి ముందు పెట్టింది సమంత. అంతేకాదు రోజు రోజుకూ పరిస్థితులు మారుతాయని, మీ కోసం ఏది ఉద్దేశించబడి ఉంటుందో, ఏదైతే మీరు కోరుకుంటారో దానికి మార్గం పడుతూ వస్తుంది అని సామ్ పేర్కొంది. దీంతో ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత చెప్పిన దాంట్లో పలు అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు. ఇకపోతే ఇటీవలే తన 'శాకుంతలం' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత.. ప్రస్తుతం స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు కొడుతోంది. విదేశాలను చుట్టి వస్తూ అక్కడి అందాలను కేమ్రాలో బంధించి అభిమానుల ముందు పెడుతోంది. ప్రస్తుతం సామ్.. దుబాయ్ టూర్‌లో ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3muDFMD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...