ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈనెల 19న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అంతేకాకుండా, చాలా కాలంగా హిట్టుకు దూరమైన పూరీకి ఆ దాహాన్ని తీర్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ కావడంతో పూరి గురువు రాంగోపాల్ వర్మ ఇటీవల చిత్ర యూనిట్కు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. పూరి అండ్ టీమ్ను పొగడ్తలతో ముంచెత్తారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పట్ల పాజిటివ్గా స్పందించారు. ఇప్పుడు ఈ కోవలో మెగా పవర్ స్టార్ చేరారు. తాజాగా ఈ సినిమాను చూసిన రామ్ చరణ్.. హీరో రామ్తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘‘రామ్తోపాటు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని మిగిలిన నటీనటులంతా చాలా ఎనర్జిటిక్గా నటించారు. ఈ విజయానికి కారకులైన పూరి గారికి అభినందనలు’’ అని రామ్ చరణ్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పోస్ట్కు హీరో రామ్ కూడా స్పందించారు. ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి.. దాన్ని ట్వీట్ చేశారు. ‘థాంక్యూ సో మచ్ మై బ్రదర్’ అని పేర్కొన్నారు. కాగా, రామ్ చరణ్ను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘చిరుత’ రామ్ చరణ్కు మొదటి సినిమా. తనను లాంచ్ చేసిన దర్శకుడు తాజాగా హిట్ అందుకోవడంతో చరణ్ ఆయనికి అభినందనలు తెలిపారు. అలాగే, నటుడు సుమంత్ కూడా పూరీకి అభినందనలు తెలిపారు. ‘‘ఇస్మార్ట్ శంకర్’ విజయం అందుకున్నందుకు రామ్, పూరి, ఛార్మిలకు శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు కూడా రామ్ థాంక్స్ చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Q20kd
v
No comments:
Post a Comment