Tuesday 25 January 2022

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో పాటు నేటితరం ప్రేక్షకులు విలక్షణ కాంబోలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే కలెక్షన్ కింగ్ , సూపర్ స్టార్ కాంబో సెట్ చేశారని సమాచారం. వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్ బాబు తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం మేర ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఈ మూవీ కోసమే మహేష్ బాబు- మోహన్ బాబు కలవబోతున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబు చేయాల్సిన మూవీ ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా 'సర్కారు వారి పాట' సినిమా ఆలస్యమవుతూ రావడంతో ఈ సినిమా షూట్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో కథపై కసరత్తులు చేస్తూ పక్కా వ్యూహరచన చేశారట త్రివిక్రమ్. ఈ మేరకు సీనియర్ నటుడు మోహన్ బాబు కోసం ఓ ముఖ్య పాత్ర డిజైన్ చేశారట. ఇందులో మహేష్ బాబు మేనమామగా మోహన్ బాబును చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర గురించి చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట మోహన్ బాబు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట మేకర్స్. మహేష్- త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. 1989లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన 'కొడుకు దిద్దిన కాపురం'లో మోహన్ బాబు విలన్గా నటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు బాలనటుడిగా కనిపించారు. అయితే మళ్లీ 33 సంవత్సరాల తర్వాత మరోసారి మోహన్ బాబు- మహేష్ బాబు కలిసి నటించనున్నారని తెలుస్తుండటం ఆసక్తికర అంశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KFECvH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...