Thursday 27 January 2022

రామ్ గోపాల్ వర్మ మోసాన్ని బయటపెట్టిన మహేశ్వరి.. అర్ధరాత్రి వేళ ధైర్యం చేశా కానీ!!

దాదాపు 20 ఏళ్ల క్రితం వెండితెరపై కొత్త టేస్ట్ చూపించింది హీరోయిన్ మహేశ్వరి. సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసి ఆ నాటి కుర్రకారు ఊగిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినా నేటికీ మహేశ్వరికి ఉన్న క్రేజే వేరు. శ్రీదేవి బంధువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి తన అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమాలు ''గులాబి, పెళ్లి''. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచాయి. కాగా తాజాగా మహేశ్వరి తన సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు చెబుతూ ఆర్జీవీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆలీతో సరదాగా ముచ్చట్లు పెడుతూ పలు కీలక విషయాలపై ఓపెన్ అయింది మహేశ్వరి. అప్పట్లో సినిమాలతో బిజీ బిజీగా గడిపిన తాను ప్రస్తుతం ఏమీ చేయడంలేదని, డాగ్ రిస్క్యూ, యానిమల్ రిస్క్యూ, వీధికుక్కల అడాప్షన్ లాంటివి చేస్తున్నానని చెప్పింది. అమల గారి స్పూర్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపింది. ఇకపోతే ఆ నాటి కెరీర్ విషయాలు కూడా చెబుతూ తనను ఎలా మోసం చేశారనే విషయాన్ని బయటపెట్టింది. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘గులాబి’ తనకు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చిందని మహేశ్వరి చెప్పింది. హీరోను అల్లరి పెట్టే అమ్మాయి పాత్రలో నటించిన తాను ఈ సినిమాకు తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్నానని తెలిపింది. అరుకులో 'గులాబి' సినిమాలోని మేఘాలలో తేలిపోతూ సాంగ్ చేస్తున్నపుడు బైక్ స్కిడ్ అయి లోయలో పడ్డామని, అదృష్ణవశాత్తు బయటపడ్డాం కానీ చాలా భయమేసిందని చెప్పింది. సినీ ఇండస్ట్రీలో తనకు మీనా, సంగీత బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొంది. పనిలో పనిగా అప్పట్లో ఓ పెద్దాయన మీకు 50 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదట నిజమేనా? అని ఆలీ అడగడంతో మహేశ్వరి అసలు విషయం చెప్పేసింది. ఆయన ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ అని చెబుతూ అప్పట్లో జేడీ చక్రవర్తి హీరోగా ‘దెయ్యం’ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఛాలెంజ్ చేసి వర్మ తనకు బాకీ పడ్డారని చెప్పింది. ఆ సినిమా షూటింగ్ మేడ్చల్‌లో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో షూట్ చేశామని, లొకేషన్ కాస్త భయంకరంగా ఉండేదని తెలుపుతూ సీక్రెట్ బయటపెట్టింది. ఆ ఫామ్ హౌస్ మెయిన్ రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేదని చెప్పిన మహేశ్వరి.. ఓ రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షూటింగ్ జరుగుతుండగా ఆర్జీవీ సరదాగా ఓ ఛాలెంజ్ చేశారని, ఎవరైనా ఈ సమయంలో మెయిన్ రోడ్ వరకు వెళ్లి వస్తే 50 వేలు ఇస్తా అనడంతో తాను మాత్రమే ధైర్యం చేసి ఎంత భయమేసినా మెయిన్ రోడ్డుకి వెళ్లి వచ్చానని చెప్పింది. కానీ వర్మ మాత్రం ఆ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని, ఇది చాలా అన్యాయమని అనేసింది. అలా తనను ఆర్జీవీ మోసం చేశారంటూ సరదాగా చెప్పుకొచ్చింది మహేశ్వరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3H1Qgyy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...