Monday 31 January 2022

అనసూయ డబుల్ యాక్షన్.. మొదట అలా తర్వాత ఇలా!!

బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా ఫేమస్ అయిన యాంకర్ అనసూయ.. క్రమంగా వెండితెరపై బిజీ అవుతోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఆమె, ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి తన మార్క్ చూపించిన ఈ సారి తన ఫ్యాన్స్‌కి రెండు డిఫరెంట్ షేడ్స్‌తో సూపర్ ట్రీట్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. వెండితెరపై విలక్షణ పాత్రలతో అలరిస్తున్న అనసూయ.. రీసెంట్‌గా 'పుష్ప' సినిమాలో పవర్‌ఫుల్ రోల్ చేసి మరోసారి అట్రాక్ట్ చేసింది. ఇందులో సునీల్ భార్య ద్రాక్షాయని పాత్రలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘’ సినిమాలో కూడా యాంకర్ అనసూయ సర్‌ప్రైజింగ్ రోల్ చేస్తోందని ఫిలిం నగర్ టాక్. ఈ చిత్రంలో డబుల్ యాక్షన్ చేస్తోందట ఈ యంగ్ యాంకర్. అందులో ఓ పాత్ర బ్రాహ్మణ మహిళ పాత్ర అని తెలుస్తుండగా.. రెండో పాత్ర కాస్త పవర్‌ఫుల్ పాత్ర అని తెలుస్తోంది. ఇది సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని అంటున్నారు. డైరెక్టర్ రాసుకున్న కథ ప్రకారం ఒక పాత్ర చనిపోతుందట. ఆ తర్వాత రెండో పాత్ర ఎంటరై సినిమా మొత్తం కనిపిస్తుందని సమాచారం. ఈ న్యూస్ బయటకు రావడంతో ఒకే తెరపై అనసూయ డ్యూయల్ రోల్‌లో చూడాలనే కుతూహలం జనాల్లో పెరిగింది. ఇక ఖిలాడి సినిమా విషయానికొస్తే.. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌ లైన్‌. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా? భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అనే అంశాన్ని ఈ సినిమాలో టచ్ చేయబోతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/VD0xrLiuN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...