Friday 28 January 2022

కనీసం బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా.. సింగర్ కౌసల్య పోస్ట్ వైరల్

సినీ ఇండస్ట్రీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వరకు పలువురు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి వైరస్ కొంత మంది సినీ ప్రముఖులను మనకు దూరం చేసింది కూడా. ప్రస్తుతం కొనసాగుతున్న థర్డ్ వేవ్‌లో ఇటీవలే చిరంజీవి, శ్రీకాంత్ సహా పలువురు సినీ నటులకు కరోనా సోకి చికిత్స పొందుతుండగా.. తాజాగా ప్రముఖ కరోనా బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన తాజా పరిస్థితిని తెలిపారు. ''కరోనా పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. నాలో ఈ వైరస్ ల‌క్ష‌ణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ప్రస్తుతం క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నాను. గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుంచి మందులు తీసుకోవడం మొద‌లు పెట్టాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి'' అని పేర్కొంది కౌసల్య. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థర్డ్ వేవ్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేప్తోంది. ప్రస్తుతం దేశం మెత్తం మీద 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u5YcLz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...