Tuesday 30 March 2021

కరోనా తెచ్చిన తంటా.. గవర్నమెంట్ నిర్ణయంతో 'ఖిలాడి'కి షాక్.. నిలిచిపోయిన రవితేజ న్యూ మూవీ!!

గతేడాది సినీ ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరడం ప్రారంభించింది. దేశవిదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కోవిడ్ ఇబ్బందులు పోయినట్లే అనుకున్న తరుణంలోనే షాకిస్తూ కొత్త కేసులు నమోదవుతుండటం అందరినీ అయోమయంలో పడేసింది. ఈ క్రమంలో నేరుగా కరోనా షాక్ కొత్త సినిమా 'ఖిలాడీ'కి తగిలిందని తెలుస్తోంది. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో సెట్స్‌పై ఉంది. అక్కడ కొన్ని రోజులపాటు షూటింగ్ జరుపుకోగా తాజా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చిందట. ఇటీవల క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న కారణంగా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో మాస్ మహారాజా మూవీ షూటింగ్‌కి బ్రేక్స్ పడ్డాయని సమాచారం. పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వస్తుందో రాదో క్లారిటీ లేకపోవడంతో చిత్రయూనిట్ తిరిగి హైదరాబాద్‌కి పయనమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రవితేజ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంతా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. సో.. చూడాలి మరి అన్నట్లుగానే మే 28న ఈ సినిమాను విడుదల చేస్తారా? లేక షూటింగ్ డిలే కారణంగా వాయిదా వేస్తారా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PKoXCY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...