Tuesday 30 March 2021

మహేష్ బాబు డూప్ దీన స్థితి.. కనీసం పిల్లలకి పాలు కొనలేక ఆకలితో పస్తులు, కన్నీటి పర్యంతం

మేం కళనే నమ్ముకుని ఉన్నాం.. డూప్‌గా చేస్తూ చిన్న చిన్న ఈవెంట్లు చేస్తున్నాం. మాకు ఇది తప్ప వేరే పని తెలియదు. మేం ఒక ప్రోగ్రామ్ చేస్తే వెయ్యి రెండువేలు ఇస్తారు.. నెలలో ఐదారు ప్రోగ్రామ్స్ దొరికితేనే పూట గడుస్తుంది. ఈ కరోనా వల్ల ప్రోగ్రామ్స్ రావడం లేదు. ఎవరూ పిలవడం లేదు. పెళ్లం పిల్లల్ని కూడా పోషించలేని స్థితిలో ఉండిపోయాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం.. నాకు ముగ్గురు పిల్లలు.. ఒక బాబుకి తొమ్మిదేళ్లు.. ఆ తరువాత ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వాళ్లు పాలు తాగుతున్నారు. వాళ్లకి కనీసం పాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం.. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం.. ఉదయాన్నే రెండు పాల పేకెట్లు.. సాయంత్రం రెండు పాల పేకెట్లు తీసుకుని వెళ్లాలి. లేదంటే వాళ్లు ఆకలితో ఏడుస్తూ ఉంటారు. నేను పస్తులుండైనా సరే వాళ్ల ఆకలి తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో మాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు.. మాలాంటి వాళ్లని పట్టించుకునేవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. ఆరోజుకి ఆరోజు చూసుకుని మురిసిపోవడం తప్ప.. ఇంతకంటే మా జీవితాలు బాగుపడటం లేదు. ఫ్యాన్స్ అసోషియేషన్స్‌లు ముందుకు వచ్చి సాయం చేస్తుంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు కరోనా టైంలో సాయం చేశారు. మహేష్ బాబుకి డూప్‌గా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. రాజకుమారుడు సినిమా అప్పటి నుంచి మహేష్ బాబు డూప్‌గా చేస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ అప్పల రాజు సినిమాలో చేశా. మహేష్ బాబు డూప్‌గా చేయడానికి అవకాశం రాలేదు. అయితే థమ్స్ అప్ యాడ్‌లో మహేష్ బాబు డూప్‌గా చేసే అవకాశం వచ్చింది.. తీరా ముంబై వెళ్లిన తరువాత వేరే వాళ్లతో చేయించారు’ అంటూ తన ధీన పరిస్థితిని చెప్పుకొచ్చాడు శ్రీను.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QNuQ2V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...