Monday 31 August 2020

వీడియో: షూటింగ్ షురూ చేసిన సుప్రీం హీరో.. ఇస్మార్ట్ బ్యూటీతో స్టెప్పులు

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు నాలుగు నెలలు ఇంటికే పరిమితమైన సుప్రీం హీరో ఎట్టకేలకు ముఖానికి రంగేసుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సాయి ధరమ్ తేజ్‌తో పాటు హీరోయిన్ నభా నటేష్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ తిరిగి ప్రారంభించిన విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) వీడియోను విడుదల చేసింది. షూటింగ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ వీడియోలో చూపించారు. క్యారవ్యాన్‌లను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి సెట్‌లోకి వస్తున్నారు. ఇక మేకప్‌మ్యాన్‌లు పీపీఈ కిట్‌లు ధరించి నటీనటులకు మేకప్ వేస్తున్నారు. మొత్తం మీద అన్ని జాగ్రత్తల నడుమ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. షూటింగ్ తిరిగి ప్రారంభంకావడంపై హీరోహీరోయిన్లు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించారు. Also Read: ‘‘తిరిగి సెట్స్ మీదుకి రావడం చాలా బాగుంది. మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి మేం చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం’’ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. అలాగే నభా నటేష్ ట్వీట్ చేస్తూ.. ‘‘షూటింగ్‌ను తిరిగి ప్రారంభించినందుకు మేం సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. అదే సమయంలో మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బి.బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తు్న్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ISMXp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...