Monday 31 August 2020

దేశం విలువైన వజ్రాన్ని కోల్పోయింది: ప్రణబ్ మృతికి చిరంజీవి సహా సినీ ప్రముఖుల సంతాపం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరిన ప్రణబ్.. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 21 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చివరికి అస్తమించారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ , నటి రోజా, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రవీణాటాండన్, రితేష్ దేశ్‌ముఖ్, సాయి ధరమ్ తేజ్, తాప్సి, మోహన్‌లాల్, సంగీత దర్శకుడు తమన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులు ట్విట్టర్ ద్వారా ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాంప తెలిపారు. Also Read: దేశం ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి నన్నెంతగానో బాధించింది. ఆయనతో మాట్లాడిన మాటలు నాకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. గొప్ప జ్ఞానం కలిగిన నిష్ణాతుడు ఆయన. అద్భుతమైన రాజకీయ జీవితం. మిమ్మల్ని కోల్పోతున్నాం సార్. దేశం ఒక విలువైన వజ్రాన్ని నేడు కోల్పోయింది. ప్రణబ్ దా ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి మాత్రమే కాదు.. ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రణబ్ లేని లోటు తీరనది విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QEy1qj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...