Monday 31 August 2020

హరీష్ శంకర్‌తో పవన్ సినిమా.. అప్‌డేట్ ఇచ్చిన నిర్మాతలు

పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు సోమవారం సాయంత్రం అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం 4:05 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీ ప్రకటిస్తారు. Also Read: మరోవైపు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘విరుపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కీరవాణి సంగీతం సమకూరుస్తు్న్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను విలన్‌గా తీసుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తయిన వెంటనే క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను పవన్ ప్రారంభించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QBwbGK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...