Saturday 29 August 2020

దొంగ బాబాలపై చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా.. నవ్వులే నవ్వులు!!

మెగాస్టార్ కామెడీని కూడా ఎంత బాగా పండిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన హీరోగా బోలెడన్ని కామెడీ సినిమాలు వచ్చాయి. మరోవైపు, మాటల మాంత్రికుడు శ్రీనివాస్ సినిమాల్లో కామెడీ శాతం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే.. థియేటర్లలో నవ్వులే నవ్వులు. ఆ సమయం ఎంతో దూరంలో లేదని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల ద్వారా వస్తోన్న సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటికే చిరంజీవికి స్టోరీ లైన్ నెరేట్ చేశారట. ఇది దొంగ స్వామీజీలపై రాసుకున్న కథ అని అంటున్నారు. అందుకే, కామెడీ పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయట. భక్తి ముసుగులో ప్రజలను మోసం చేస్తోన్న స్వామీజీలపై త్రివిక్రమ్ ఎక్కుపెడుతున్న బాణం ఈ సినిమా అంటున్నారు. చిరంజీవి, త్రివిక్రమ్ కలిసి గతంలో ‘జై చిరంజీవ’ సినిమాకు పనిచేశారు. అయితే, ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. మరి ఇప్పుడు చిరంజీవిని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారో లేదో చూడాలి. Also Read: ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ తన తరవాత సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు. ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతోంది. తమన్ సంగీతం సమకూర్చనున్నారు. మరోవైపు, చిరంజీవి ‘ఆచార్య’తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34JSS3I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...