Saturday 31 July 2021

నెటిజన్లకు షాక్ ఇచ్చిన సమంత.. ఆ ఒక్క అక్షరమే చాలు అంటున్న కుందనపు బొమ్మ

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సమంతా. ఆ తర్వాత పలు స్టార్ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమె అనతి కాలంలోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అక్కినేని నట వారసుడు నాగ చైతన్యతో ఆమె ప్రేమాయణం.. ఆ తర్వాత పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. అక్కినేని కోడలు అయిన తర్వాత.. సమంతకు పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే.. మరోవైపు యాంకర్‌గా కూడా పలు ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరించారు సమంత. రీసెంట్‌గా ఓటీటీలో కూడా ఆమె అడుగుపెట్టారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌తో ఆమె ప్రేక్షకులను పలకరించారు. ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సిరీస్‌లో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆమె ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె తన సోషల్‌మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పేరును తొలగించి.. కేవలం ‘ఎస్’ అనే ఒక అక్షరాన్ని మాత్రమే ఉంచింది. అయితే ఇది అభిమానుల మదిలో కాస్త కలవరపాటుని సృష్టించింది. అసలు ఇందుకు కారణం ఏంటీ.. సమంత ఏదైనా అనూహ్యమైన నిర్ణయం తీసుకుందా? లేక.. తన తదుపరి సినిమా శాకుంతంకి సూచనగా ఇలా పెట్టిందా అని ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఊహాగానాలు వస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ffO7TU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...