Friday 30 July 2021

సూపర్‌స్టార్ మహేష్ సినిమాపై మరో లేటెస్ట్ అప్‌డేట్.. ఆడియో రైట్స్ ఎవరివంటే..

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి వరుస భారీ సక్సెస్‌లు అందుకొని సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న తన 27వ సినిమాను ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి ప్రకటించి చాలాకాలమే అయినా.. వచ్చిన అప్‌డేట్‌లు మాత్రం తక్కువే. ఇంతకాలం వరకూ సినిమా నుంచి ఎలాంటి అప్‌డైట్‌లు లేకపోవడంతో చిత్రయూనిట్‌పై మహేష్ అభిమానులు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. తమ అభిమాన నటుడి సినిమాపై ఎప్పుడు అప్‌డేట్ వస్తుందా అంటూ వాళ్లు ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్నారు. అలా ఆతృతగా ఉన్న అభిమానులకు తాజాగా చిత్ర యూనిట్ మంచి శుభవార్త అందించింది. ఈ నెల 31వ తేదీన సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను ‘సరిగమ సౌత్’ సంస్థ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో త్వరలోనే ‘సర్కారు వారి పాట’ నుంచి పాటల సందడి కూడా ప్రారంభం అవుతుందని సంకేతం వచ్చినట్లే. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాపై విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BZZvwY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...