Monday 29 June 2020

మూడు రోజులుగా ఫోన్ల మీద ఫోన్లు.. ఆ రూమర్ ఎవరు క్రియేట్ చేశారో గానీ: రేణు దేశాయ్

పవన్ మాజీ భర్య, హీరోయిన్ .. మరోసారి ముఖానికి రంగేసుకోబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. 'జాని' మూవీ తర్వాత తిరిగి వెండితెరపై కనిపించని ఆమె నటన విషయమై కీలక నిర్ణయం తీసుకుందని, మహేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న కొత్త సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై రియాక్ట్ అయింది రేణు. ఇప్పటివరకూ ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్ అంటూ చమత్కరిస్తూనే అట్టి వార్తలను ఖండించింది. మహేష్ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి.. గత రెండు మూడు రోజులుగా తనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని, చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని తెలిపింది. కాగా ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి రియల్లీ హ్యాట్సాఫ్ అంటూ తనదైన స్టైల్‌లో స్పందించింది రేణు దేశాయ్. మహేశ్ బాబు సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. Also Read: గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వస్తే.. హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం కారణంగానే ఇలాంటి రూమర్స్ పుట్టించారని రేణు తెలిపింది. అదేవిధంగా అకీరా సినీ ఎంట్రీ గురించి కూడా మాట్లాడిన ఆమె.. అతను ఏ వృత్తిని ఎంచుకున్నా ఓ తల్లిగా ప్రోత్సహిస్తానని చెప్పింది. సినీ రంగం లోకి రావడమనేది అతని ఇష్టమే అని తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eIZsK9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...