Tuesday 30 June 2020

Allu Arjun: తమన్నాతో రామ్ చరణ్.. ఆ ఆలోచన బన్నీదే!! వెరీ ఇంట్రెస్టింగ్..

డిజిటల్ మాధ్యమానికి, ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలకు క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. కరోనా కారణంగా షూటింగ్స్, థియేటర్స్ ఎక్కడికక్కడే మూతబడటం ఆన్‌లైన్ ప్రపంచానికి మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. ఈ సిచుయేషన్ క్యాచ్ చేసుకునేలా అల్లు అరవింద్ ఇటీవలే 'ఆహా' పేరుతో ఓ ఓటీటీ వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై పలు సినిమాలు రిలీజ్ చేస్తూ డిజిటల్ మాద్యమంలోనూ తమ మార్క్ చూపిస్తున్నారు. అయితే ఈ 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం ఓ టాక్ షో చేయనుందని గత రెండు మూడు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు ఈ టాక్ షోలో అల్లు అర్జున్, , రవితేజ వంటి స్టార్ హీరోలను, కొందరు హీరోయిన్లను కూడా తమన్నా ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలుస్తుండటం అందరిలోనూ ఆసక్తి నెలకొల్పింది. కాగా జనాలను ఆకర్షించేలా ఈ ప్రోగ్రాం చేయాలన్న వినూత్న ఆలోచన అల్లు అర్జున్‌ది అని తెలుస్తోంది. Also Read: ఓటీటీ డిమాండ్, సెలబ్రిటీ ముచ్చట్ల పట్ల జనాల ఆసక్తి గమనించిన అల్లు అర్జున్.. తన తండ్రి అల్లు అరవింద్‌కి ఈ సలహా ఇచ్చారట. పైగా తమన్నాను హోస్ట్‌గా తీసుకోవాలని రెఫర్ చేసింది కూడా బన్నీనే అనేది విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇకపోతే ఈ షోలో 20 ఎపిసోడ్స్ ఉంటాయని, ఇందుకోసం తమన్నా 7 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఆన్‌లైన్ వేదికపై తమన్నా ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dMbDnW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...