పవర్ స్టార్ హీరోగా ఫిబ్రవరి 25న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది భీమ్లా నాయక్ మూవీ. టాలీవుడ్ భారీ మల్టీస్టారర్గా రూపొందిన ఈ సినిమాలో రానా కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఇతర అప్డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ భారీ రేంజ్ వ్యూస్ రాబడుతోంది. ఈ ట్రైలర్ చూసిన తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''భీమ్లా నాయక్ ట్రైలర్లో ఆ పవర్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారి ప్రతీ డైలాగ్, యాక్షన్ పవర్ఫుల్గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్. త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, నిత్య మీనన్, సితార ఎంటర్టైన్మెంట్స్, తమన్కు ఆల్ ది బెస్ట్'' అంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు రామ్ చరణ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ మూవీ ట్రైలర్పై అబ్బాయి రామ్ చరణ్ ఇచ్చిన ఈ రివ్యూ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ రేంజ్లో 'భీమ్లా నాయక్' మూవీ రూపొందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి భారీ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/UzFsfnq
v
No comments:
Post a Comment