తెలుగు సినిమా సత్తా ఎల్లలు దాటుతోంది. టాలీవుడ్ మూవీస్ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఇతర భాషా నటులు సైతం తెలుగు తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో నటించేందుకు రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ మరో తెలుగు సినిమా ఓకే చేసిందని సమాచారం. గతంలో ''వినయ విధేయ రామ, భరత్ అనే నేను'' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కియారా అద్వానీ, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ ప్రాజెక్టు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు కమిటైందట కియారా. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్' షూటింగ్లో భాగమవుతున్న .. ఈ సినిమా పూర్తి కాగానే జనగణమన ప్రాజెక్టులో భాగం కాబోతున్నారని విన్నాం. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఇంకో సినిమా ఉండబోతోందని, అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేశారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని అంటున్నారు. శివ చెప్పిన కథ వినగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కియారా అద్వానీ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BVI32Xt
v
No comments:
Post a Comment