పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఆయన రీసెంట్గా తన ట్విట్టర్లో ఎవరినో టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దానిపై వివరణ అడిగితే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తనకు ఆరాధ్య దైవమని జై దేవర పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ కూడా చేశారు. అదే తరుణంలో ఆయన ఆడియో ఫైల్ ఒకటి లీక్ అయ్యింది. అందులో త్రివిక్రమ్ తనను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాకుండా అడ్డుకుంటున్నారని, తనకు రావాలని ఉన్నా ఆయన కొందరు వైసీపీ నేతలతో కలిసి తనను టార్గెట్ చేస్తున్నాడంటూ ఉంది. ఈ ఆడియో క్లిప్ సోమవారం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ను దేవర అంటూ పిలిచే బండ్ల గణేష్ వీరాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఉండే స్నేహం గురించి కూడా బండ్ల గణేష్కు తెలియంది కాదు. అలాంటిది త్రివిక్రమ్పై బండ్ల గణేష్ అలా ఎలా మాట్లాడుతాడు అనే చర్చ కూడా నడిచింది. అయితే ఈ ఆడియో క్లిప్పై ఓ ప్రముఖ ఛానెల్కు బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. ఆ ఆడియో తనది కాదని, ఫేక్ ఆడియో అని, ఎవరో క్రియేట్ చేసిందని కొట్టి పారేశారు. అలాగే ఆ విషయంపై కూడా తాను స్పందించాలనుకోవడం లేదని కూడా తేల్చి పారేశారు. అయితే బండ్ల గణేష్ నిజంగానే అలా మాట్లాడాడా? తనని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అనే దానిపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. శివ రాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుంది. ఇందులో మరో హీరోగా రానా దగ్గుబాటి కూడా నటించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 21న జరగాల్సిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వాయిదా పడింది. ఇది ఫిబ్రవరి 23న జరగబోతుంది. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bJshaX
v
No comments:
Post a Comment