Sunday 27 February 2022

క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? : ప్రకాష్ రాజ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా న‌టించిన చిత్రం ‘’. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్‌తో చాలా మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ సినిమాకు తొలి రెండు రోజుల్లో ఓవ‌ర్ సీస్‌తో క‌లుసుకుని రూ.83 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఈ సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. కానీ.. త‌గ్గించిన టికెట్స్ రేట్స్ విష‌యంలో, వాటిని పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం జీవోలు తీసుకుని ఉండుంటే.. ఇంకా భారీ వ‌సూళ్లు వ‌చ్చి ఉండేవి. భీమ్లా నాయ‌క్ సినిమా విష‌యంలో జీవోను విడుద‌ల చేయ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం కావాల‌నే అడ్డుప‌డుతుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు అంటున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కావాల‌నే రాజ‌కీయం చేస్తుంద‌ని ప్ర‌తి ప‌క్షాలు కూడా విమ‌ర్శలు చేస్తున్నాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ఇలా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు సాగుతున్న నేప‌థ్యంలో ‘భీమ్లా నాయక్’ సినిమాకు మ‌ద్ద‌తుగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సోష‌ల్ మీడియా ద్వారా వ్యాఖ్య‌లు చేశారు. ‘‘సృజ‌న‌, సాంకేతిక‌త మేళ‌వించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిప‌త్య దోర‌ణి ఏమిటి? చిత్ర ప‌రిశ్ర‌మ‌ను క్షోభ పెడుతూ మేమే ప్రోత్స‌హిస్తున్నామంటే న‌మ్మాలా? ఏమైనా ఉంటే రాజ‌కీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎందుకు? ఎంత‌గా ఇబ్బంది పెట్టినా ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌కు ఎవ‌రూ అడ్డుక‌ట్ట వేయ‌లేరు’’ అన్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత అయిన త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/WuOgLFB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...