Sunday 31 January 2021

పవన్ కళ్యాణ్‌- క్రిష్ సినిమా టైటిల్‌పై కీలక నిర్ణయం.. విరూపాక్ష కాదని చివరకు ఈ టైటిల్ ఫిక్సయ్యారా?

రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేశాక ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్ కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయ్యారట పవన్. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని, ఈ చిత్రానికి '' అనే టైటిల్ ఫిక్స్ చేశారని విన్నాం. అయితే తాజా సమాచారం మేరకు ఈ టైటిల్ ఇప్పటికే ఓ డైరెక్టర్ రిజిస్టర్ చేయించుకోవడంతో క్రిష్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. టైటిల్ విషయమై చిత్ర నిర్మాతలు, పవన్ కళ్యాణ్‌తో చర్చించి చివరకు '' అనే టైటిల్‌ ఫైనల్ చేశారని సమాచారం. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. సో.. ఈ టైటిల్ విషయంలో అసలు నిజం ఏంటనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oAe7LP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...