Sunday 31 January 2021

మెగా హీరోను కలిసేందుకు సాహసం.. ఏకంగా 200 కి.మీ. నడిచిన వీరాభిమాని

సినిమా హీరోలపై వారి అభిమానులు చూపించే అభిమానం మామూలుగా ఉండదు. తాము ఎంతగానో ఇష్టపడే హీరోని చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. వారితో ఫోటో దిగాలని తాపత్రయపడుతుంటారు. ఇక సినిమాల విడుదలకు భారీ కటౌట్లు, వాటికి పూలదండలు, పాలాభిషేకాలు ఎప్పుడూ ఉండేవే. కానీ, ఇప్పుడు ఓ మెగా హీరోని కలిసేందుకు ఈ వీరాభిమాని ఏకంగా 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. వివరాలివీ.. తెలంగాణలోని జిల్లా భిక్కనూరుకు చెందిన బాలు అనే వ్యక్తికి మెగా కుటుంబానికి వీరాభిమాని. అందులోనూ ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ అంటే బాగా పిచ్చి. ఆ అమితమైన అభిమానంతోనే అతను వరుణ్‌ తేజ్‌ను కలవాలని గత మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా భిక్కనూరు నుంచి హైదరాబాద్‌ వరకూ 200 కిలో మీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. తనని చూసేందుకు కోసం అంత దూరం నడిచి వచ్చిన ఈ సూపర్‌ అభిమానిని వరుణ్‌ తేజ్‌ ఆదరించారు. ఆ అభిమానిని తన ఆఫీసులో కలిశారు. తన అభిమాని ఇలా తన కోసం నడిచి వస్తున్న విషయం తెలుసుకున్న వరుణ్‌ తేజ్‌ నేరుగా తన కార్యాలయానికే పిలిపించారు. అతనితో కొద్ది సేపు మాట్లాడారు. తనపై చూపుతున్న అభిమానానికి వరుణ్‌ తేజ్ ఎంతో సంతోషించారు. ఆ అభిమానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అభిమానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా తన అభిమానిని కలిసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pBqBnL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...