మాస్ మహారాజ్ కొత్త సినిమా 'క్రాక్' ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చెబుతున్నారు హీరో రవితేజ. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. డబ్బింగ్ పనులతో బిజీ అంటూ ట్వీట్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై ఠాగూర్ మధు నిర్మించారు. చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్గా నటించగా.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. మాస్ ఆడియన్స్ ఉగిపోయేలా రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. నూతన సంవత్సరానికి కానుకగా జనవరి 1వ తేదీన క్రాక్ థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు న్యూ ఇయర్ ఫన్ మామూలుగా ఉండదని తెలిపారు. గతంలో రవితేజ- గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ''డాన్ శీను, బలుపు'' చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్స్లో మాస్ మహారాజ్ హంగామా చూడాలని ఆతృతగా ఉన్నారు ప్రేక్షకులు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KIwkc9
v
No comments:
Post a Comment