కరోనా క్రమంగా తగ్గిపోతుందనుకున్న తరుణంలో మెగా కుటుంబంలో కరోనా కలకలం రేగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. RRR షూటింగ్లో పాల్గొంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాతి రోజే వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా పాజిటివ్ అని పేర్కొనడంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పైగా ఉపాసన సైతం తనకు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ, వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలపడంతో అందరి కన్ను మెగా ఫ్యామిలీపై పడింది. రీసెంట్గా జొన్నలగడ్డ చైతన్యతో మ్యారేజ్ కావడం, అనంతరం నిహారిక బర్త్ డే, ఆ వెంటనే క్రిస్మస్ రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పార్టీలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో వేడుకలో ప్రతి ఒక్కరూ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది. దీంతో మరి నవదంతులు నిహారిక, చైతన్యలకు కూడా కరోనా సోకి ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిహారికకు కూడా కరోనా సోకి ఉంటుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లే ముందు డిసెంబర్ 26వ తేదీన ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిహారిక, చైతన్య కరోనా పరీక్షలు చేయించుకున్నారని, అలాగే తిరిగి వచ్చేటప్పుడు డిసెంబర్ 29న ముంబై ఎయిర్ పోర్ట్లోనూ కరోనా టెస్టులు చేయించుకోగా నెగెటివ్ వచ్చినట్లు నాగబాబు తెలిపారు. దీంతో మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mWSl40
v
No comments:
Post a Comment