మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ను చిత్ర నిర్మాణ సంస్థ గురవారం వెల్లడించింది. అదేంటంటే.. ‘క్రాక్’ మూవీకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆయన వాయిస్ ఓవర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదలైతే ‘క్రాక్’పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. కాగా, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/351hgNF
v
No comments:
Post a Comment