Tuesday 28 January 2020

Actor John Kottoly: టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ ఆకస్మిక మరణం

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు ఆకస్మికంగా కన్నుమూశారు. మను, ఫలక్‌నుమా దాస్ తదితర చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన జాన్ కొట్టాలీ తీవ్ర గుండెనొప్పితో మంగళవారం నాడు మరణించారు. ఈ దిగ్బ్రాంతికర విషయాన్ని ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘మిస్టర్ అమాయకుడు’, ‘కళాకారుడు’ వంటి లఘు చిత్రాల్లో మంచి నటుడిగా పేరు సంపాదించి సినిమాల్లో తన సత్తా చాటారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులతో జాన్ కొట్టాలీకి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్‌తో పాటు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా తదితరులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1wptK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...