Wednesday 29 January 2020

ఇప్పుడున్న పరిస్థితిలో చిరు అన్నయ్య టైటిల్ వాడుకుంటున్నా: శ్రీకాంత్

1991లో కెరీర్‌ను ప్రారంభించి ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సినీ నటుడు శ్రీకాంత్. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు కాస్త బ్రేక్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు కానీ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఏడాదికో సినిమా చేస్తూ వస్తున్నారు. 2019లో ‘మార్షల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ ఇప్పుడు మరో థ్రిల్లింగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మరణ మృదంగం’ అనే టైటిల్‌నే పెట్టారు. సినిమా త్వరలో విడుదల కాబోతోందని తాజాగా శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. READ ALSO: ‘‘మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై ‘మరణ మృదంగం’ అనే సినిమా చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అన్నయ్య చిరు టైటిల్‌నే వాడుకున్నాను. అన్నయ్య నటించిన ఈ సినిమాను చాలా సార్లు చూశాను. నాకు చాలా ఇష్టమైన టైటిల్. అదీకాక సినిమా కాన్సెప్ట్‌కు ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని దర్శకుడు, నిర్మాత అనుకున్నారు. వెంకటేష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తీశాడు. అతను చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. నేను కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కథ చేస్తే బాగుంటుందని అని ఆలోచించి ఒకటికి రెండుసార్లు కథ విని ఓకే చేశాను. మాఫియా, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలు అన్నీ ఉంటాయి. దీంతో రెండు డ్యుయల్ రోల్స్ చేస్తున్నాను. సినిమా ఓపెనింగ్‌కి వచ్చిన అనిల్ రావిపూడి, కోదండరామిరెడ్డికి ధన్యవాదాలు. మాకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RWIXzX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...