చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు సినీ నటి రేణూ దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో విడిపోయాక తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుణెలో స్థిరపడిపోయారు. ఆ తర్వాత పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జ్గా వ్యవహరించారు. ఇటీవల రేణు మెగా ఫోన్ పట్టారు. రైతుల నేపథ్యంలో ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న ఘనంగా నిర్వహించారు. వేడుకకు రేణు అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమాలోని ఓ పాటను నా చేత విడుదల చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన అనంత్ శ్రీరామ్, చిన్మయి ఈ పాటకు కలిసి పనిచేశారు. రాజ్ కందుకూరి సినిమాను నిర్మించారు. ఇంకా మాట్లాడొచ్చా. బహుశా సుమ గారి అనుమతి తీసుకుని మాట్లాడాలేమో. మున్ముందు అన్ని చిత్ర పరిశ్రమల్లో మహిళా దర్శకులు, టెక్నీషియన్లు రావాలి. వారికి సినిమా పరిశ్రమలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఏ ఫీమేల్ టెక్నీషియన్ అయినా రాజ్ కందుకూరితో కలిసి పనిచేస్తే ఆమె చాలా సేఫ్గా ఉంటారు అని నేను గర్వంగా చెప్పగలను’’ READ ALSO: "‘చూసి చూడంగానే’ సినిమాలో రాజు గారు నాకు తల్లి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. కానీ ఆ సమయంలో నాకు ఒంట్లో బాగోలేదు. దాంతో సినిమా చేయలేకపోయాను. నేను అసలు పాత్ర ఏంటి అని కూడా అడగలేదు. రాజు గారు నిర్మాత అనగానే ఓకే చెప్పేద్దామని అనుకున్నాను. ఆయనతో ఉన్నప్పుడు నేను సేఫ్గా ఉంటాను. అలాంటి నిర్మాతలు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. టీంకి ఆల్ ది బెస్ట్’ అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aQ8xix
v
No comments:
Post a Comment