Wednesday 29 January 2020

నడుం పట్టుకోవాలని చూశాడు వేలు విరిచేసా: తాప్సి

సినీ నటి తాప్సికి ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైందట. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి ఆకతాయి చేష్టలు సర్వ సాధారణమే. కానీ తాప్సికి మాత్రం పవిత్రమైన పుణ్యస్థలంలో వేధింపులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘గురునానక్ జయంతి రోజున నేను ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా గురుద్వారకు వెళ్తాను. గతేడాది కూడా వెళ్లాను. అక్కడ భక్తులకు భోజనాలు వడ్డిస్తుంటాం. ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వస్తాను. దాంతో ఒకర్నొకరు ఢీకొట్టుకుంటూ ఉంటారు. ఓసారి నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఆకతాయి నా నడుం పట్టుకోవాలని చూశాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎలా బుద్ధిచెప్పాలో ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అతని వేలు పట్టుకుని విరిచేశాను. దాంతో వాడు విలవిలలాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. నేను కూడా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాను’ అని తెలిపారు. READ ALSO: ప్రస్తుతం చేతిలో చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్. టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సి నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మిథాలీగా తాప్సి చాలా బాగా కనిపించారు. దీంతో పాటు ఆమె ‘తప్పడ్’, ‘రాకెట్ రష్మి’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. మంచి మెసేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో తాప్సి ఒకరు. ఆమె సినిమా రంగానికి చేస్తున్న సేవకు గానూ త్వరలో పద్మశ్రీ అందుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2REgOyC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...