Wednesday 29 January 2020

Coronavirus Effect: ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ లియోనీ

బాలీవుడ్ బ్యూటీ తన ఫ్యాన్స్‌ని ఎప్పుడూ నిరుత్సాహపరచదు. ఎయిర్‌పోర్ట్‌లలో, ఈవెంట్స్‌లో, సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇలా సన్నీ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. వారి ప్రేమను అర్థం చేసుకుని సన్నీ కూడా సెల్ఫీలు ఇచ్చేందుకు వెనుకాడరు. అయితే నిన్న మాత్రం సన్నీ ఫ్యాన్స్‌కి వింత అనుభవం ఎదురైంది. విహారయాత్ర నుంచి తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ ముంబయిలో అడుగుపెట్టారు. అక్కడ ఫ్యాన్స్ సన్నీతో సెల్ఫీ దిగాలని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ ఫ్యాన్స్‌ని ఆప్యాయంగా పలకరించే సన్నీ ఈసారి మాత్రం వారిని దూరంపెడుతున్నట్లు ప్రవర్తించారు. ఇందుకు కారణం ప్రపంచాన్ని హడలుకొడుతున్న కరోనా వైరసే. అవును, అసలే చైనాలో ఈ వైరస్ బారిన పడి దాదాపు వంద మందికి పైగా చనిపోయారు. ఈ వైరస్ భారత్‌లోనూ వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదీ కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలంతా ఎయిర్‌పోర్ట్‌లోనే తిరుగుతుంటారు. అందుకే సన్నీ ఫ్యాన్స్ సెల్ఫీ కావాలని అడిగినప్పుడు కాస్త వెనుకడుగు వేశారు. అయినా కూడా ఓ యువతి సెల్ఫీ కోసం సన్నీ వద్దకు వెళ్లగానే సన్నీ వెంటనే తన వద్ద ఉన్న మాస్క్‌తో ముక్కు, నోరు మూసేసుకున్నారు. దాంతో పక్కనే ఉన్న మరో మహిళ కోపంతో సెల్ఫీ దిగకుండానే వెళ్లిపోయారు. READ ALSO: అయితే తాను ఫ్యాన్స్‌తో అలా ప్రవర్తించినందుకు ఏమాత్రం బాధపడటంలేదని సన్నీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై అవగాహన పెంచుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొరోనా వైరస్ మనకు ఎందుక వస్తుంది అని మాత్రం అనుకోకండి. స్మార్ట్‌గా ఉండండి, సేఫ్‌గా ఉండండి’ అని పేర్కొంటూ తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U8vMic
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...