Tuesday 28 January 2020

Esha Rebba: మంత్రిగారి బైక్‌పై ఈషా రెబ్బా రై రై.. వైరల్ అవుతున్న ఫొటోలు

తెలంగాణ రవాణా శాఖా మంత్రి , తెలుగు బ్యూటీ బైక్ రైడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు సోమవారం 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం హెచ్ఎమ్‌డీఏ మైదానంలో వారోత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు భద్రతా నిబంధనలను పాటించాలని వారిలో అవగాహన కల్పించడంలో భాగంగా స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవింగ్ చేశారు.. వెనుక సీట్లో హీరోయిన్ ఈషా రెబ్బా కూర్చోవడం విశేషం. రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘సమాజంలో వాహనాలు, జనాభా సంఖ్య పెరగడంతో విపరీతంగా రోడ్డు యాక్సిడెంట్‌‌లు పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహన నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్‌ను ధరించాలి. కారు తదితర భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్‌ బెల్టులు పెట్టుకొని ప్రయాణం చేయాలి.. మద్యం సేవించి వాహనాలు నడిపితే నడిపేవారితో పాటు ఎదుటివారికి సైతం ప్రమాదాలు సంభవిస్తాయి.. ట్రాఫ్డిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రయాణాల్లో అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వ్యవహరించాలి’ అని సూచించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఈషా రిబ్బా ప్రత్యేక ఆకర్షణ కాగా.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానీయ, హైద్రాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aUECWP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...