Thursday 30 April 2020

సినీ ఇండస్ట్రీకి షాకింగ్ న్యూస్ .. ఆసుపత్రిలో మరో నటుడు! క్లారిటీ ఇచ్చిన తనయుడు

బాలీవుడ్‌లో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు బీ టౌన్ మొత్తం విషాద ఛాయలు నింపేశాయి. మొన్న టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో మరణించగా, నిన్న మరో సీనియర్ నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోయారు బీ టౌన్ పబ్లిక్. ఇండస్ట్రీ గొప్ప నటులను కోల్పోయిందని, బాలీవుడ్‌కి ఇది భయానక వారమని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే బాలీవుడ్ షాకయ్యేలా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరో బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసుపత్రి పాలయ్యారని ఆ వార్త సారాంశం. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసున్న నసీరుద్దీన్ షా హిందీ చిత్రసీమలో గొప్ప నటుడిగా, డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి 1980 దశకంలో తన హవా కొనసాగించారు. అలాంటి దిగ్గజ నటుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారనే వార్త చూసి బాలీవుడ్ లోకం ఉలిక్కిపడింది. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇది గమనించిన నసీరుద్దీన్ షా తనయుడు వివాన్ షా వెంటనే స్పందిస్తూ అలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి ఆసుపత్రి పాలయ్యారని చెక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని, దయచేసి అలాంటి వాటిని నమ్మొదంటూ అభిమానులను కోరారు వివాన్ షా. ఈ మేరకు ట్వీట్ చేసిన వివాన్ షా.. ''తన తండ్రి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్. అతను బాగానే ఉన్నారు. ఇర్ఫాన్ భాయ్, చింటూజీల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. వారిని బాగా మిస్ అవుతున్నాం. వారు లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం'' అని పేర్కొన్నారు. దీంతో నసీరుద్దీన్ షా ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xo79VH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...